భారతదేశం, ఏప్రిల్ 19 -- విశాఖ‌ప‌ట్నంలో దారుణ‌మైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి అమ్మాయిల‌తో కొంత మంది యువ‌కులు స్నేహం చేస్తున్నారు. ఆపై వారికి మత్తు మందు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన త‌రువాత అత్యాచారం చేస్తారు. అత్యాచార‌ ఘ‌ట‌న‌ల‌ను వీడియోలు తీసి, బెదిరింపుల‌కు దిగుతున్నారు. ఇలాంటి తరహా ఘటనలో మోసపోయిన బాధిత యువ‌తి పోలీసుల‌ను ఆశ్రయించింది. దీంతో ఆ యువ‌కుల ముఠా గుట్టు ర‌ట్టు అయింది.

ఈ ఘ‌ట‌న‌ విశాఖ‌ప‌ట్నంలోని నాలుగో ప‌ట్టణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన యువ‌కుడు ర‌వీంద్రతో పాటు మ‌రికొంత మంది యువ‌కుల ముఠా మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడ‌క్ట్స్‌, టూవీల‌ర్ రైడ్ యాప్ పేరుతో పెళ్లికాని యువ‌తుల నుంచి వివరాలు సేక‌రిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడెక్టుల‌ను చూపించే వంక‌తో ప‌రిచ‌యాలు పెంచు...