Andhrapradesh, జూన్ 11 -- సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు(జూన్ 12) తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులను జమ చేయనున్నారు.మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి.

ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం స్కీమ్ అందించనున్నారు. 67,27,164 మంది విద్యార్థులకు పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ స్కీమ్ కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనున్నారు.

1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్ధులకు కూడా అర్హులవుతారు. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. విధి విధానాలను ఖరారు చేస్తూ ఇవాళనే ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

తల్లికి వందనం స్కీమ్ క...