భారతదేశం, జూన్ 23 -- అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా "సుపరిపాలనలో తొలి అడుగు" పేరుతో నేడు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్వోడీలు (శాఖల అధిపతులు), సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో కలిసి జరుగుతున్న ఈ కార్యక్రమం మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, చేసిన మార్పులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని ఈ సమావేశంలో సమీక్షిస్తారు. అలాగే, వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చాలి, అభివ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.