భారతదేశం, మే 5 -- రాష్ట్రంలో అకాల వర్షాల వలన ఆస్తి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యం, రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందనేది ప్రభుత్వం లెక్కలు కూడా తీయలేదని ఆరోపించారు.

"ఈ సీజన్ లో దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. కానీ ప్రభుత్వం కొన్నది మాత్రం కేవలం 13 లక్షల మెట్రిక్ టన్నులే. ఇంకా 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ ధాన్యం ఎవరు కొనాలి? చివరి గింజ వరకు కొంటాం అని ఇచ్చిన హామీ ఏమయింది?

తెలంగాణలో ఇదే పరిస్థితి ఏర్పడితే... అక్కడ ప్రభుత్వం విదేశాలకు నేరుగా బియ్యం ఎక్స్ పోర్ట్ చేస్తుంది. ఫిలిప్పీన్స్, మలేషియా దేశాలతో త...