భారతదేశం, జూన్ 4 -- భారతదేశ జనాభాను లెక్కించే ప్రక్రియ 2027 మార్చి 1వ తేదీన ప్రారంభంవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు బుధవారం తెలిపారు. తదుపరి జనగణనతో పాటు కుల గణన కూడా ఉంటుంది. ఈ జనగణన కార్యక్రమం 2027 మార్చి 1 నుండి ప్రారంభమవుతుందని, అయితే లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ప్రభావిత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ 2026 అక్టోబరులో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. జనాభా గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు.

భారతదేశంలో చివరి జనాభా గణన 2011 లో జరిగింది. సాధారణంగా భారత్ లో ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కిస్తారు. 2011 వరకు 15 సార్లు భారత్ లో జనగణ నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 లో జరగాల్సిన దేశవ్యాప్త జనాభా గణన ఆలస్యమైంది. 2027 జనగణనలో కులాల వారీ జనాభాను కూడా ల...