Telangana,nalgonda, మే 21 -- ప్రజా పాలన పర్సంటేజీల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అవినీతి, కమీషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే నోటీసుల డ్రామా అడుతున్నారని విమర్శించారు. కమిటీల పేరుతో, కమీషన్‌ల పేరుతో కాలయాపన చేసే ప్రయత్నాలను చూస్తూ ఊరోకమని హెచ్చరించారు. ఇవాళ నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటంపై స్పందించారు.

"గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది. అందులో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు. కాళేశ్వరం ప్రాజక్టును విఫల ప్రయోగంగా చూపించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూది పింజలు లాగా తేలిపోతాయన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థ మీద అపార గౌరవం ఉంది. ముమ్మాటికి ధర్మం గెలుస్తుంది" అని కేటీఆర్ వ్యాఖ్యాన...