భారతదేశం, మే 20 -- మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే, సలసల మరిగే నీలోని రక్తమే' అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తాను హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు'లో ఈ పాట వినిపిస్తుందన్నారు. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించిందన్నారు.

సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను పవన్ కల్యాణ్ సందర్శించారు. కాసేపు కీరవాణితో ముచ్చటించి ఆయనను సన్మానించారు.

ఈ పాటను 21వ తేదీన విడుదల చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 'హరిహర వీరమల్లు' చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను అగ్ర స్థాయికి తీసుకువెళ్తాయన్నారు. ఈ సినిమా కోసం కీరవాణి ఎంత తపన పడి స్వరాలు అందించారో తాను స్వయంగా చూశానన...