భారతదేశం, నవంబర్ 25 -- ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే విక్రయమవుతున్న కియా సోరెంటో త్రీ-రో ఫ్యామిలీ ఎస్యూవీ తొలిసారిగా భారత్లో టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది! ఈ సోరెంటో ఆధారంగా కియా సంస్థ ఒక హైబ్రిడ్ ఎస్యూవీని తయారు చేస్తోంది. దీని కోడ్నేమ్ ఎంక్యూ4ఐ. ఇది మన దేశంలో మహీంద్రా ఎక్స్యూవీ700, టాటా సఫారీ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. తాజాగా కనిపించిన వాహనం రాబోయే ఈ మోడల్కు సంబంధించిన టెస్ట్ మ్యూల్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
పార్కింగ్ సదుపాయంలో టెస్టింగ్ చేస్తుండగా కనిపించిన ఈ క్యామోఫ్లేజ్డ్ కియా సోరెంటో ఎస్యూవీ టెస్ట్ మ్యూల్లో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి.
డిజైన్: ఎత్తుగా ఉండే బోనెట్, చదరపు ఆకారంలో ఉన్న వీల్ ఆర్చ్లు, ఫ్లాట్ టెయిల్గేట్, వెనుక భాగం వెడల్పుగా ఉండటం వంటి లక్షణాలతో దీని త్రీ-రో బాడీ షేప్ స్పష్టంగా తెలుస్తోంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.