భారతదేశం, మే 30 -- ఆదాయానికి మించిన ఆస్తులపై ఒడిశా విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఓ ప్రభుత్వ ఇంజనీర్ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.2 కోట్లకు పైగా నగదు, విలువైన ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ లోని రాష్ట్ర ఆర్ డబ్ల్యూ డివిజన్ లోని ప్లాన్ రోడ్స్ చీఫ్ ఇంజనీర్ వైకుంఠ నాథ్ సారంగి నివాసాలు, కార్యాలయాల్లో ఒడిశా పోలీసుల అవినీతి నిరోధక విభాగం దాడులు నిర్వహించింది. అతడి ఇతర నివాసాల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

సారంగి నుంచి స్వాధీనం చేసుకున్న నగదులో సుమారు రూ. 90 లక్షల నగదును భువనేశ్వర్ ఫ్లాట్ నుండి స్వాధీనం చేసుకున్నామని, అంగుల్ లోని అతని నివాసంలో 1.1 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తనిఖీలు చేయడానికి అధికారులు భువనేశ్వర్ లోని తన భవనంలోకి ప్రవేశించిన వెంటనే.. తన ఫ్లాట్ కిటికీ నుంచ...