భారతదేశం, మే 20 -- భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి హారతి కార్యక్రమాన్ని లైవ్ కవరేజీ చేశారు.

ప్రతీ రోజు సాయంత్రం నిర్వహించే సరస్వతి హారతిని ఇవ్వడానికి, కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే పండితులను ప్రత్యేకంగా ప్రభుత్వం పిలిపించింది. దాదాపు అరగంట పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది ప్రత్యేక హారతులను ఇస్తారు.

సరస్వతి నవరత్న మాలా హారతి మహోత్సవం 6వ రోజు అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సరస్వతి అమ్మవారి హారతిని వీక్షించి దివ్యదర్శనం పొందారు.

సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప...