భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం, రావులపాలెం నుంచి స్పెషల్ సర్వీసులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. మే 15వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ యాత్రలో వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, రామప్ప దేవాలయం, కాళేశ్వరం ప్రాంతాలను సందర్శించవచ్చు. మరిన్ని వివరాలకు 995922557 నంబర్‌కు కాల్ చేయవచ్చని.. ప్రజా రవాణా అధికారి ఎస్టీపీ కుమార్ సూచించారు.

ఈ పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు జరుగుతాయి. గురుడు మిథున రాశిలో ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా భావించే సరస్వతీ నదుల సంగమ స్థానం. ఈ సంగమం చాలా పవిత్రమైనదిగా భ...