Telangana, జూన్ 6 -- కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 20 నిమిషాలకుపైగా ఆయన్ను కమిషన్ విచారించింది. ప్రాజెక్ట్ కు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలను సంధించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానాలు ఇచ్చారు.

విచారణ ముగిసిన తర్వాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు కమిషన్ కు చెప్పానని వెల్లడించారు. అంతేకాకుండా కమిషన్ ఎదుట చెప్పిన విషయాలను ఈటల వివరించారు.

కాళేశ్వరం విషయంలో అన్నీ కేబినెట్‌ నిర్ణయం మేరకే జరిగాయని ఈటల రాజేందర్ అన్నారు. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారని కమిషన్ అడిగిన ప్రశ్నకు. ఆ సాంకేతిక అంశాలపై తమకు అవగాహన ఉండదని చెప్పినట్లు త...