భారతదేశం, జూన్ 9 -- మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ విచారణలో కమిషన్ ఛైర్మన్ అడిగిన 20 ప్రధాన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలన్నింటికీ హరీష్ రావు పూర్తి ఆధారాలతో సహా సమాధానాలు సమర్పించారు. హరీష్ రావు ఇచ్చిన వివరణలకు కమిషన్ ఛైర్మన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కమిషన్ అడిగిన మొదటి ముఖ్యమైన ప్రశ్న తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని ఎందుకు మార్చారనే దానిపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. దీనిపై హరీష్ రావు సమగ్ర వివరణ ఇచ్చారు.

"తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత, తమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును 7 ప్యాకేజీలు, 27 భాగాలుగా టెండర్లు పిలిచి, తల పనులు మొదలుపె...