భారతదేశం, మే 29 -- ీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలతో పాటు మినీ మహానాడు-2025 కార్యక్రమం కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌‌లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని భీమవరం రుచులు బాంకెట్ హాల్‌లో బుధవారం రాత్రి 7 గంటలకు మొదలైంది. ఈవెంట్‌ను ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆ తర్వాత ఎన్టీఆర్‌‌కు ఘన నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు వర్చువల్‌గా హాజరయ్యారు.

ఎన్నారై టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి తదితరులు గెస్ట్ స్పీకర్లుగా వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి రావడం సంతోషంగా ఉందని జయరాం కోమటి అన్నారు. ప్రపంచవ్యాప్తం...