భారతదేశం, మే 31 -- కార్తీక దీపం సీరియల్ నేటి (మే 31, 2025) ఎపిసోడ్‍‌లో.. నా ఇంటికి నన్ను దగ్గర చేసేందుకు, రెండు కుటుంబాలకు కలిపేందుకు చేసే ప్రయత్నంలో మీతో నేనుంటానని కార్తీక్‍కు దీప చెబుతుంది. నీ మనసేంటో అర్థమయ్యాక కాదని ఎలా అంటానని కార్తీక్ చెబుతాడు. నేనే ఆశ్చర్యపడేలా నువ్వు మారావని, ఎప్పుడు ఏం చేయాలో చెబుతానని అంటాడు. ఇద్దరం కలిసే ఈ యుద్ధాన్ని చేద్దామని కార్తీక్ అంటాడు. ఇద్దరూ చేతులు కలుపుతారు.

ఇప్పుడు మన చేతులు కలిశాయ్.. రేపు మన కుటుంబాలను కలపాలని దీపతో కార్తీక్ అంటాడు. ఈ ఇంట్లో రాక్షసుల నుంచి మంచి వాళ్లను కాపాడేందుకు ఇక్కడికి వచ్చామని చెబుతూ ఉంటాడు. కొత్త పనోళ్లారా.. ఇంత సేపు మీటింగా అంటూ పారిజాతం అక్కడికి వస్తుంది. మాటల్లో మర్యాద తగ్గిపోతే ముఖం పగిలిపోతుందంటూ కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ పారును ఆటాడుకుంటాడు. ...