భారతదేశం, మే 28 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి (మే 28, 2025) ఎపిసోడ్‍‌లో నేను కుబేర సొంత కూతురినేనా అని అనసూయను దీప అడుగుతుంది. కుబేర కూతురివే అని ముందుగా అబద్ధం చెబుతుంది అనసూయ. మా అమ్మకు పురుడు పోసేటప్పుడు అక్కడే ఉన్నావా అంటే అవునంటుంది అనసూయ. పుట్టగానే నిన్ను ఎత్తుకొని మీ నాన్న మురిసిపోయాడని చెబుతుంది. దీంతో కుబేర ఫొటోను తీసుకొచ్చి అనసూయతో ఒట్టు వేయిస్తుంది దీప. ఇప్పుడు నిజం చెప్పాలని అడుగుతుంది. దీంతో అనసూయ తల్లడిల్లిపోతుంది. నిజం చెప్పక తప్పడం లేదని అనుకుంటుంది.

ఇప్పుడు నేనేం చెప్పాలని మదనపడుతుంది అనసూయ. నిజం చెప్పు అంటూ దీప పదేపదే అడుగుతుంది. నేను కుబేర, అంబుజవల్లి కన్నకూతురినని ఒట్టేసి చెప్పు అత్త అని అనసూయను దీప గట్టిగా ప్రశ్నిస్తుంది. దీప అనాథ అని ఎవరికీ తెలియకూడదని గతంలో కుబేర తీసుకున్న మాటను అనసూయ తలుచుకుంటుంది. కానీ కుబేరపై ద...