భారతదేశం, మే 24 -- కార్తీక దీపం 2 నేటి (మే 24, 2025) ఎపిసోడ్‍లో ఇంటికి వచ్చి దీప ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది.. జ్యోత్స్న రెస్టారెంట్‍కు వచ్చిందా అని కాంచన అడుగుతుంది. వచ్చిందని, కార్తీక్ బాబు కుర్చీలో జ్యోత్స్న కూర్చుందని దీప అంటుంది. పనోడితో చేయించాల్సిన పనులు చేయిస్తోందని చెబుతుంది. కార్తీక్ బాబుతో కాఫీ తెప్పించుకొని కావాలనే ఒలకబోసి టేబుల్ క్లీన్ చేయించిందని కన్నీటితో చెబుతుంది. దీంతో కాంచన ఆగ్రహిస్తుంది. సంతకం పెట్టించుకొని కూలివాడిలాగా పని చేయించుకుంటుందా అని అనసూయ కూడా కోప్పడుతుంది. ఏడ్వడం తప్ప నాకు ఏం చేయాలో తెలియడం దీప లేదని అంటుంది. జ్యోత్స్న గురించి తండ్రి శివన్నారాయణ, అన్నావదినలను అడుగుతాదం పదా అని కాంచన అంటుంది. దీప వద్దంటుంది.

జ్యోత్స్న చెప్పినవన్నీ చేసేందుకు కార్తీక్ బాబే సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలమని దీప బాధగా చెబుతుంది. ...