భారతదేశం, జూన్ 7 -- కార్తీక దీపం 2 నేటి (జూన్ 7, 2025) ఎపిసోడ్‍లో.. దాసును జ్యోత్స్న కొట్టడం కళ్లారా చూశానని, ఆ బాధను మనసులోనే మోస్తున్నానని కార్తీక్‍తో దశరథ్ చెబుతాడు. ఒకవేళ నేను పోతే ఈ నిజం నాతోనే పోకూడదు అని అంటాడు. నీకేం అవుతుంది మామయ్య.. ఇప్పుడు నేను ఉన్నా కదా అని కార్తీక్ చెబుతాడు. "ముందు దాసు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. వాడికి గతం గుర్తొస్తే జ్యోత్స్న వాడిని ఎందుకు చంపాలనుకుందో తెలుస్తుంది రా" అని దశరథ్ అంటాడు. "దీప నీ కూతురు, అది మీకు చెప్పకుండా దాసును జ్యోత్స్న చంపాలనుకుంది. ఆ విషయం మీకు ఇప్పుడే చెప్పను" అని లోలోపల ఆలోచిస్తాడు కార్తీక్. కన్నతండ్రిని కాబట్టి జ్యో చేసిన పనితో బాధను గుండెల్లో మోస్తున్నా.. నిజం తెలిస్తే మీ అత్తయ్య పరిస్థితి ఆలోచించు అని దశరథ్ బాధగా చెబుతాడు.

ముందు నిజాలు తెలుసుకున్న తర్వాతే ఏం చేయాలో ఆలోచిద్దామని దశ...