భారతదేశం, జూన్ 2 -- కార్తీక దీపం 2 నేటి (జూన్ 2, 2025) ఎపిసోడ్‍లో.. తలకు ఐస్‍ప్యాక్ పెట్టుకొని కంగారుగా కూర్చొని ఉంటుంది జ్యోత్స్న. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి నుదుళ్లకు మసాజ్ చేసి తలపడుతుంది దీప. అయితే, అలా చేస్తోంది పారిజాతం అనుకొని.. దాసు ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి తలపోటుగా ఉందని, థ్యాంక్స్ గ్రానీ అని జ్యోత్స్న అంటుంది. "నీ చేయి పడగానే రిలాక్స్డ్ గా ఉంది, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది గ్రానీ" అని జ్యో చెబుతుంది. ఇంతలోనే అక్కడికి పారు రావడం చూస్తుంది. ఇది ఎవరు అనుకుంటుంది. దీపను చూసి నువ్వా అని అంటుంది.

ఏమైందే అని పారిజాతం అంటుంది. దీప తల పట్టుకుందని జ్యోత్స్న చెబుతుంది. తల పట్టుకుందా గొంతు పట్టుకుందా అని పారిజాతం అంటుంది. గొంత ఎందుకు పట్టుకుంటానని దీప అడిగితే.. చంపేందుకేమోనని పారిజాతం అంటుంది. నేను ఎవరినీ ఎప్పుడూ చంపలేదు.. మీరు ఎవరినై...