భారతదేశం, మే 8 -- క‌త్తి పోట్ల‌కు గురైన దీప చావుబ‌తుకుల్లో ఉంటుంది. దీప బ‌త‌కాలంటే బ్ల‌డ్‌ అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు చెబుతారు. దీప‌, సుమిత్ర‌ది ఒక‌టే బ్ల‌డ్ గ్రూప్ కావ‌డంతో దీప‌కు ర‌క్తం ఇచ్చి బ‌తికించ‌మ‌ని సుమిత్ర కాళ్లు ప‌ట్టుకొని బ‌తిమిలాడుతాడు కార్తీక్‌. కానీ సుమిత్ర అత‌డి మాట‌ల‌కు క‌ర‌గ‌దు. కార్తీక్‌ను అవ‌మానించి ఇంట్లో నుంచి వెళ్ల‌గొడ‌తాడు శివ‌న్నారాయ‌ణ‌.

కార్తీక్ వెళ్లిపోగానే.. భార్య‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని వ‌చ్చాడు కానీ...మావ‌య్య‌కు ఎలా ఉందో చూడ‌టానికి వ‌చ్చాడా అని పారిజాతం అంటుంది. కార్తీక్ రావాల‌ని నేనేం కోరుకోలేద‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. ఒక‌వేళ దీప బ‌తికిన త‌ర్వాత అయినా జైలుకు వెళ్లాల్సిందేన‌ని చెబుతాడు. జైలుకు వెళుతుందో...పైకి వెళుతుందో ఆ భ‌గ‌వంతుడే నిర్ణ‌యిస్తాడ‌ని అంటాడు.

కాళ్లు ప‌ట్టుకున్నార‌ని క‌రిగిపోవ‌ద్ద‌ని, దొంగ సాక్ష్య...