భారతదేశం, నవంబర్ 8 -- కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవరం దగ్గర హైవేపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచివున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు ఫ్రంట్ టైరు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళ్తున్న కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలోనే సోమవరం దగ్గర హైవేపై ఉన్న బస్సు షెల్టర్లోని ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ బైక్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.దర్యాప్తు చేస్తున్నారు.
Published by H...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.