భారతదేశం, మే 13 -- కాంతార సీరియ‌ల్‌కు ఈటీవీ శుభం కార్డు వేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ సీరియ‌ల్ క్లైమాక్స్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఈ వీక్‌లోనే కాంత‌ర‌ సీరియ‌ల్ ముగియ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాంతార సీరియ‌ల్ గ‌త ఏడాది జూలైలో మొద‌లైంది. ఈ సీరియ‌ల్‌లో గౌర‌వ్‌, అక్ష‌య‌, ప‌వ‌న్‌, ర‌వీంద్ర కీల‌క పాత్ర‌లు పోషించారు. శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సీరియ‌ల్‌లో హీరోయిన్ నేహా దేశ్‌పాండే మ‌రో ఇంపార్టెంట్ రోల్‌లో న‌టించింది. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించింది.

ఇందులో కాంత‌ర‌గా టైటిల్ పాత్ర‌లో అక్ష‌య త‌న యాక్టింగ్‌తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. కాంతార గోపి ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటారు. కానీ పెద్ద‌లు మాత్రం వారి ప్రేమ‌ను అంగీక‌ర...