భారతదేశం, ఏప్రిల్ 29 -- ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ముగిసిపోయాయి. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొంది.

ఆర్థికశాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటు జిల్లాల్లో వందలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న విషయం తెలిసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....