భారతదేశం, మే 4 -- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వరద నివారణ పనులు, ధాన్యం కొనుగోళ్లు, భద్రకాళి చెరువు సుందరీకరణపై సమీక్ష నిర్వహించేందుకు.. సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం హనుమకొండ జిల్లాకు వచ్చారు.

మంత్రులు హైదరాబాద్ నుంచి హెలీక్యాప్టర్ లో నేరుగా దేవాదుల ప్రాజెక్టులో భాగంగా హసన్‌పర్తి మండలం దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌజ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. వారికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవన్నపేట ప్రాజెక్టు 3 పంప్ హౌజ్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఆఫీసర్లతో దేవాదుల ప్రాజెక్టు పనులపై రివ్యూ చేశారు.

ఇంటర్నల్ గా జరిగిన ఈ రివ్యూకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లను తప్ప...