భారతదేశం, ఏప్రిల్ 27 -- ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం బ్లాక్ హిల్స్ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ గుట్టలను అన్నివైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి. దాదాపు వెయ్యి మంది వరకు తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది.

గుట్టలో పెద్ద మైదానంతో విశాలంగా ఉన్న సొరంగాన్ని జవాన్లు గుర్తించారు. ఇందులో నీటి వసతి, ఇతర సౌకర్యాలున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. అటు ఈ గుట్టల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డీహైడ్రేషన్‌కు గురయ్యారని, వారి పరిస్థితి విషమంగా మారుతోందని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.

నిరం...