భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్లు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో.. సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అయితే.. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కర్రెగుట్టలో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేతలు హిడ్మా, దేవ టార్గెట్గా ఐదు రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతుంది. దాదాపు 20 వేల మంది బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టు సమాచారం. శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగినట్టు తెలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.