భారతదేశం, ఏప్రిల్ 18 -- శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృతి చెందారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హిందూపూరం మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
బొలెరో పికప్ వాహనంలో ప్రయాణిస్తూ.. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళుతున్నారు. ఆ వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అమరాపుర క్రాస్ సమీపంలోని వంతెనను ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలోని నలుగురు ప్రయాణికులు నాగరాజ్, సోమ, నాగభూషణ్, మురళి మరణించారు. డ్రైవర్ ఆనంద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గబ్బూర్ పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by HT Digit...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.