భారతదేశం, డిసెంబర్ 25 -- కర్ణాటకలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిత్రదుర్గం​ హిరియూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 17 మంది సజీవహదం అయినట్టు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న అనేక మంది గాయపడ్డారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. ఓ లారీ అదుపు తప్పి డీవైడర్​ని దాటింది. ఆ వెంటనే, అటుగా వస్తున్న ప్రైవేట్​ బస్సును బలంగా ఢీకొట్టింది. సరిగ్గా డీజిల్​ ట్యాంక్​ వద్ద లారీ తగలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మంటలు మొత్తం బస్సుకు వ్యాపించాయి.

ఈ ప్రైవేట్​ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళుతోందని సమాచారం.

ప్రమాదం సమయంలో బస్సులో 30కిపైగా మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో చ...