భారతదేశం, డిసెంబర్ 25 -- కర్ణాటకలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చిత్రదుర్గం​ హిరియూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది సజీవహదం అయినట్టు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న అనేక మంది గాయపడ్డారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

చిత్రదుర్గ జిల్లా హిరియూర్​ తాలుకాలోని హోర్లథు క్రాసింగ్​ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హియూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి డీవైడర్​ని దాటింది. ఆ వెంటనే, అటుగా వస్తున్న ప్రైవేట్​ బస్సును బలంగా ఢీకొట్టింది. సరిగ్గా డీజిల్​ ట్యాంక్​ని లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మొత్తం బస్సుకు మంటలు వ్యాపించాయి.

ప్రమాదం సమయంలో ఈ ప్రైవేట్​ బస్సు బెంగళూరు నుంచి శి...