భారతదేశం, ఏప్రిల్ 27 -- విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో నడుపూరి కల్లాలు గ్రామం ఉంది. ఈ గ్రామంలో పాండ్రంకి అప్పలనాయుడు, జయ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాజశేఖర్‌ ఉన్నాడు. అతనికి రెండేళ్ల కిందట నెల్లిమర్ల మండలం వల్లాపురం పంచాయతీకి చెందిన మహిళతో పెళ్లి చేశారు. కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది.

కానీ ఇటీవల కుమారుడు రాజశేఖర్ తమ మాట కాకుండా.. కోడలు చెప్పిందే చేస్తున్నాడంటూ కుటుంబంలో గొడవలు జరిగాయి. అది కాస్త క్రమంగా ఆస్తి వివాదాలకు దారితీసింది. అటు అప్పలనాయుడు, జయ దంపతులకు కుమార్తె కూడా ఉంది. ఆమెకు పెళ్లి చేయగా.. భర్త చనిపోయాడు. భర్తను కోల్పోయిన కుమార్తెకు.. అదనంగా కొంత భూమి ఇవ్వాలని తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో కుమారుడిని కోరారు. అందుకు అతను నిరాకరించాడు.

ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి. గొడవలు జర...