భారతదేశం, మే 24 -- ఇండియాలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ ఛైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లే శనివారం స్పందించారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మిస్ ఇంగ్లాండ్ మాగీ ఆరోపణలను ఖండించారు.

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో ఆర్గనైజర్లు కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని మిస్ ఇంగ్లండ్ మిల్లా...ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. పార్టీల్లో ఇద్దరు అందగత్తెలకు ఒక్కో టేబుల్ చొప్పున కేటాయించారని, వారు ఆ టేబుల్ వద్ద కూర్చొన్న అతిథులను అలరించాలని చెప్పారు. ఇలాంటి చోట ఉండలేక పోటీల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధ...