భారతదేశం, డిసెంబర్ 31 -- ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియా (క్యూర్) లో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కోర్-అర్బన్ రీజియన్‌ను మొత్తంగా ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని హైదరాబాద్ నగర జోనల్ కమిషనర్లను ఆదేశించారు.

నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....