Hyderabad, మే 17 -- ఒక మారుమూల గ్రామంలో పుట్టిన సాధారణ అమ్మాయి నందిని గుప్తా. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. చిన్నప్పటినుంచి పొలాల గట్ల మీద పెరిగిన బాల్యం నందినిది. అలాంటి అమ్మాయి ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక రైతు బిడ్డకు ఇంత ధైర్యం.. ఏదైనా సాధించగలననే సానుకూల దృక్పథం ఎలా వచ్చింది?

జీవితం ఎవరికీ పూల పాన్సు కాదు. ఒత్తిళ్లు ప్రతిక్షణం అణిచివేయడానికి చూస్తూనే ఉంటాయి. అలాంటి ఒత్తిళ్ళ మధ్య కూడా నందిని గుప్తా తన ప్రశాంతమైన ప్రవర్తనతోనే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రపంచ వేదికపై నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ముఖ్యంగా అపారమైన ఒత్తిడిని తట్టుకునే శక్తి కావాలి. ఆమె ఆ ఒత్తిడిని తట్టుకోవడం చిన్నప్పటినుంచి అలవరచుకుంది. పాజిటివ్ థింకింగ్ అనేది ఆమెకి ఎంతగానో సహాయపడినట్టు చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. నందిని కఠిన...