భారతదేశం, మే 27 -- ఓవైపు రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి. మరోవైపు అల్పపీడనం ఏర్పడింది. ఈ రెండు ప్రభావాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే నాలుగు రోజులు కూడా భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

ఇవాళ (మంగళవారం) కర్నూలు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు (బుధవారం) కర్నూలు, నంద్యాల, అనంతపురం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో.. ఈ నెల 30 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధ...