భారతదేశం, మే 2 -- ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ - 2025 ప్రవేశాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష ప్రిలిమినరీ కీని అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ ను కూడా విడుదల చేశారు. ప్రాథమిక కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మే 5వ తేదీలోపు పంపాలని అధికారులు తెలిపారు.

సరైన ఆధారాలను ఓయూలోని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ లో ఇవ్వొచ్చు. లేదా ouphd2025@gmail.com కు మెయిల్ చేయవచ్చని అధికారులు సూచించారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 27వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి.

అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారిని క్వాలిఫైడ్‌గా గుర్తిస్తారు. ఓసీ అభ్యర్ధులకు కనీసం 35 మార్కులు రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ క్యాటగిరీలలో 32 మార్కులు రావాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్...