Telangana,hyderabad, సెప్టెంబర్ 4 -- ఉస్మానియా యూనివర్శిటీలో(PGRRCDE) దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన అభ్యర్థులు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీసీఏ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ ద్వారానే అప్లయ్ చేసుకోవాలి. ఇక రూ. 500 ఫైన్ తో సెప్టెంబర్ 25వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 28వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఐసెట్ - 2025లో క్వాలిఫై అయిన వారు ఈ ఎంట్రెన్స్ రాయాల్సిన అవసరం లేదు. వీరికి నేరుగానే అడ్మిషన్లు కల్పించనున్నారు.

ఈ కోర్స...