భారతదేశం, మే 6 -- ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డి,ఓఎంసీ కంపెనీని కోర్టు దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటించించింది.

ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు అధికారులు జైలు జీవితం గడిపారు. 2022లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది కోర్టు.

ఓబుళాపురం మైనింగ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఏ 1 నుంచి ఏ 7 వరకు సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏ8 కృపనందం, ఏ 9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది.

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి ...