Telangana,hyderabad, జూలై 13 -- తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువు ముగియగా.. అధికారులు మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.
వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను(2025-26) 10వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందుతారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్సైట్లో చూడొచ్చు.
ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఇక ఇంటర్ లో ప్రవేశం పొందేందుకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.