భారతదేశం, ఫిబ్రవరి 9 -- విశాఖలో ఈ మధ్యకాలంలో నైట్ టైమ్‌లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు పదే పదే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేయగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసిన వ్యక్తే ఈ చోరీలు చేశాడని గుర్తించారు.

కాకినాడకు చెందిన మహేశ్ రెడ్డి అలియాస్ సన్నీ వైజాగ్‌లోని మాధవధార ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఐటీ రంగంలో మంచి జీవితం ఉన్నప్పటికీ విలాసాలకు అలవాటుపడ్డాడు. వైజాగ్‌కు మకాం మార్చాడు. అతడి మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు. లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, అనేకసార్లు విదేశాలకు వెళ్తుండేవాడు. మెుత్తానికి లగ్జరీ లైఫ్‌ను గడిపేవాడు సన్నీ.

అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్నాడు. కానీ ఇటీవలి కాలంలో పోలీసులకు పదే పదే రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నట్టుగా ఫిర్యాదు...