భారతదేశం, మే 31 -- తెలుగు క్రైమ్ కామెడీ మూవీ చౌర్య పాఠం ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ మూవీ టాప్ టెన్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో కూడా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌ను దాటేసి ట్రెండింగ్ లిస్ట్‌లోకి చౌర్య పాఠం వ‌చ్చింది.

చౌర్య పాఠం మూవీలో ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మ‌స్త్ అలీ, రాజీవ్ క‌న‌కాల‌, సుప్రియ ఐసోల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ క్రైమ్ కామెడీ మూవీకి మిరాయ్‌ డైరెక్ట‌ర్ , టాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మేని క‌థ‌ను అందించారు. ధ‌మాకా డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన చౌర్య పాఠం సినిమాను నిర్మించారు. ఈ క్రైమ్ కామెడీ మూవీకి నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఏప్రిల్ నెలాఖ‌రున ...