భారతదేశం, మే 26 -- పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చి ప్రపంచ స్థాయిలో అదరగొట్టడమే కాకుండా కేరళ బక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టిన సినిమా తుడరుమ్. మోహ‌న్‌లాల్‌ అద్భుత యాక్టింగ్ తో అదరగొట్టిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది.

మోహ‌న్‌లాల్‌ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'తుడరుమ్' ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. దీంతో కలెక్షన్లు కుమ్మేసింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. మే 30 నుంచి ఈ మూవీ డిజిటిల్ స్ట్రీమింగ్ కానుంది.

బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డు నెలకొల్పిన తుడరుమ్ సినిమా ఓటీటీ ర...