భారతదేశం, మే 6 -- మ‌ల‌యాళం మూవీ ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మ‌నోర‌మా మ్యాక్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ మ‌ల‌యాళం మూవీలో సాజిన్ చెరుకాయిల్‌, ఉన్ని లాలు, స‌మృద్ధి తార కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జిష్ణు హ‌రీంద్ర వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఆ యువ జంట ప్రేమ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డుగోడ‌లుగా నిలిచాయ‌నే కాన్సెప్ట్‌తో ప‌ర‌న్ను ప‌ర‌న్ను ప‌ర‌న్ను చెల్లం మూవీని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. జిజు, సంధ్య‌ప్రేమించుకుంటారు. సంధ్య ఉన్న‌త కులానికి చెందిన అ...