Hyderabad, మే 6 -- తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మార్చిలో రిలీజైన ఈ సినిమా.. సుమారు 50 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. పెద్దగా స్టార్లు లేని ఈ మూవీకి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అంతంతమాత్రం రెస్పాన్స్ వచ్చినా.. ఐఎండీబీలో మాత్రం 8.9 రేటింగ్ సంపాదించడం విశేషం.

ఓటీటీలోకి వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు అస్త్రం (Asthram). ఈ మూవీని ఆహా తమిళం ఓటీటీ మే 9 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"యాక్షన్ ట్రీట్ ఆన్ ద వే ఫ్రెండ్స్. అస్త్రం మే 9న మన ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

అస్త్రం మూవీ ఈ ఏడాది మార్చి 21న థియేటర్లలో రిలీజై...