భారతదేశం, జూన్ 20 -- మలయాళ సినిమాలకు ఓటీటీలో ఉండే క్రేజే వేరు. డిజిటల్ స్ట్రీమింగ్ లో తెలుగు ఫ్యాన్స్.. మలయాళ సినిమాలకు పట్టం కడుతుంటారు. స్టోరీ బాగుంటే చాలు తెగ చూసేస్తారు. ఇప్పుడు అలాంటి రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేశాయి. మలయాళం సినిమాలు, సిరీస్ ఈ రోజు (జూన్ 20) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి ఏమిటంటే?

బ్యాచిలర్ పార్టీ నేపథ్యంలో సాగే కామెడీ సినిమా 'ఆప్ కైసే హో'. కడుపుబ్బా నవ్వంచే ఈ మలయాళ సినిమా శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. సన్ నెక్ట్స్ లో ఈ మూవీని చూడొచ్చు. ప్రధాన పాత్రలో ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ చిత్రంలో పెళ్లికి ముందు చేసుకునే బ్యాచిలర్ పార్టీ కారణంగా ఎలాంటి గందరగోళం తలెత్తిందనే విషయాన్ని ఫన్నీగా చూపించారు. లైట్-హార్టెడ్ ప్రీ-వెడ్డింగ్ గందరగోళం నుండి తీవ్రమైన పోలీసు దర్యాప్తుల వరకు ఈ మలయాళ...