Hyderabad, జూన్ 9 -- ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హిట్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి ఛాప్టర్ 2 డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో.. హిందీతోపాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే నటించిన హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి ఛాప్టర్ 2. జలియన్‌వాలా బాగ్ మారణ హోమం గురించి తెలియని స్టోరీని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

జూన్ 13 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస...