Hyderabad, జూన్ 1 -- టాలీవుడ్ ముగ్గురు యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తొలిసారిగా కలిసి నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. నాంది, ఉగ్రం వంటి సినిమాలతో అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేడల భైరవం సినిమాకు దర్శకత్వం వహించారు.

శ్రీ సత్య సాయి పతాకంపై కెకె రాధా మోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భైరవం సినిమాను పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ సమర్పించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన భైరవం సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్వా పిళ్లై హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.

ఎన్నో అంచనాల నడుమ రీసెంట్‌గా మొన్న (మే 30) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది భైరవం సినిమా. అయితే, ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. స్టోరీ రొటీన్‌గా ఉన్నప్పుటికీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ము...