Hyderabad, జూన్ 3 -- తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ మార్చిలో థియేటర్లలో రిలీజై మొత్తానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు జిగేల్ (jigel). త్రిగుణ్, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను మల్లి యేలూరి డైరెక్ట్ చేశాడు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తోంది? మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో రిలీజైన మూవీ జిగేల్. ఓ లోబడ్జెట్ మూవీగా రిలీజైనా.. ప్రేక్షకులను కంటెంట్ తో ఆకట్టుకున్న సినిమా ఇది. ఇప్పుడీ మూవీ గురువారం (జూన్ 5) నుంచి సన్ నెక్ట్స్ (Sun nxt) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ విషయాన్ని మంగళవారం (జూన్ 3) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"స్టైల్, థ్రిల్, రొమాన్స్. ఇదో జిగేల్ రైడ్. కూలెస్ట్ లాకర్ టెక్నీషియన్ అయిన నందు ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ద్వారా మీ స్క్రీన్లలోకి రానున్నాడు. ...