భారతదేశం, మే 24 -- ఓటీటీల్లోకి రేపు (మే 25) రెండు సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. బాలీవుడ్ మూవీ 'సికందర్' స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. థియేటర్లలో ప్లాఫ్ అయిన ఈ చిత్రం దాదాపు ఎనిమిది వారాలకు ఓటీటీలోకి వస్తోంది. కథాసుధలో భాగంగా తక్కువ నిడివి ఉండే ఓ తెలుగు చిత్రం కూడా రేపే స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రి అంటే మరికొన్ని గంటల్లోనే ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఆ వివరాలు ఇవే..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన సికందర్ చిత్రం రేపు (మే 25) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మార్చి 30వ తేదీన ఈ బాలీవుడ్ యాక్షన్ మూవీ థియేటర్లలో విడుదలైంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్లాఫ్‍గా నిలిచి...