Hyderabad, మే 25 -- ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి అలరిస్తుంటాయి. నెల నుంచి రెండు, మూడు నెలల వ్యవధిలో థియేట్రికల్ రిలీజ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు, ఫ్లాప్ మూవీస్‌తోపాటు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఉంటాయి. అలాంటి భారీ బడ్జెట్ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి ఇవాళ (మే 25) లేటెస్ట్ మూవీ సికందర్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ మూవీనే సికందర్. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.

చాలా కాలం గ్యాప్ తర్వాత అంటే సుమారుగా 2020లో రజనీకాంత్‌తో దర్బార్ మూవీ తర్వాత మురుగదాస్ డ...