Hyderabad, మే 29 -- తమిళంలో వెట్రిమారన్‌కు డైరెక్టర్‌గా ఎంతో పేరు ఉంది. అలాంటి వెట్రిమారన్ నిర్మాతగా వ్యవహరించి సాలిడ్ హిట్ అందుకున్న సినిమా గరుడన్. ఈ మూవీని తెలుగులో రీమేక్‌గా తెరకెక్కించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు.

అదితి శంకర్ హీరోయిన్‌గా నటించిన భైరవం సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు. పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పించిన భైరవం మే 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వెట్రిమారన్, నిర్మాత రాధామోహన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నారా రోహిత్ ఇతర సినీ విశేషాలను పంచుకున్నాడు.

-ఇందులో జయసుధ గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. జయసుధ గారు లెజెండరీ. ...